హైదరాబాద్: రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్లు....మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్లో సినిమాలు వస్తే అంచనాలు భారీగా ఉంటాయి, ఈ సినిమాలు మంచి హిట్టయితే రూ. 100 కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాదిప్పుడు. రూ. 100 కోట్ల పైచిలుకు వసూలు చేసే సత్తా తెలుగు సినిమా పరిశ్రమకు ఉందని ఇటీవల బాహుబలి సినిమాతో తేలిపోయింది. ఆ తర్వాత వచ్చిన కొన్ని టాప్ హీరోల సినిమాలు కూడా రూ. 100 కోట్లకు చేరువకావడం తెలిసిందే.
ఆ మధ్య పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా కూడా రూ. 100 కోట్లకు చేరువలో ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో సినిమా కాస్త నష్టపోయింది కానీ భారీ హిట్టయితే రూ. 100 కోట్లు దాటేవే అనేది ట్రేడ్ విశ్లేషకుల మాట. మంచి కథ కు ఎంటర్టెన్మెంట్ జోడించి....యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులను థియేటర్లకు మెప్పించగలిగితే రూ. 100 కోట్లకు పైగా షేర్ సాధించడం సాధ్యమే అంటున్నారు.
ఈ గణాంకాల నేపథ్యంలో తెలుగులో పలు భారీ బడ్జెట్ చిత్రాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్ తో ఓ భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. 2017 జనవరిలో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.