లెజండరీ దర్శకుడు దాసరి నారాయణరావు మరణించడంతో.. ఆ లోటు తనను తీవ్రంగా కలచి వేస్తోంది అంటున్నారు పవణ్ కళ్యాణ్. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా షూటింగులో బిజీగా ఉన్న పవన్.. దాసరి భౌతికఖాయం దర్శించుకోవడానికి ఈరోజు ఉదయం త్రివిక్రమ్ తో కలసి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు దాసరితో ఎప్పుడూ పవన్ కలసి పనిచేయలేదు కాని.. దాసరి ప్రొడక్షన్లో ఒక సినిమా చేస్తానని మాత్రం అప్పట్లో తెలిపారు. దాసరి కూడా ఈ సినిమాను రియాల్టీకి తీసుకురావాలని చాలా ప్రయత్నించారు. కాని వర్కవుట్ కాలేదు.
ఇకపోతే పవన్ కు దాసరి అంటే ఎంత ఇష్టం అంటే.. ఈ మధ్యకాలంలో ఆదివారాల్లో కూడా పనిచేసేస్తున్న పవన్.. ఇప్పుడు దాసరి మరణం సందర్భంగా తన ప్రగాఢ సానుబూతిని తెలియజేస్తే.. తన సినిమా యునిట్ కు మూడు రోజులు సెలవలు డిక్లేర్ చేశాడు. ఇవాళ రేపే ఎల్లుండ పవన్ షూటింగ్ చేయబోడట. దాసరి లేని లోటును భర్తీ చేయలేం కాని.. వారి కోసం ఓ మూడు పనిదినాలు సంతాపం తెలపడం బాధ్యతాయుతమైన చర్యగా ఆయన అభిమానులు అభివర్ణిస్తున్నారు.
ఇకపోతే అసలు దాసరి భౌతిక ఖాయం చూడ్డానికి మెగాస్టార్ చిరు కాని ఆయన తనయుడు చరణ్ కాని రాలేకపోయారు. చైనాకు వెళుతున్న చిరంజీవి.. మధ్యలో ట్రాన్సిట్ లో ఉండటం కారణంగా.. అటు త్వరగా చైనా వెళ్లలేరు.. ఇటు తిరిగి స్వదేశానికి రాలేని పరిస్థితి. అలాగే తన భార్యతో కలసి యురోప్ వెళ్లి అక్కడి విలేజ్ లో ఉన్న చరణ్.. వెంటనే పయనమైనా కూడా హైదరాబాద్ రావడానికి రెండు రోజులు పడుతుందట. అందుకే చరణ్ రాలేకపోయాడట.