మనకు తెలిసిన కొన్ని క్లైమాక్స్ ఏంటి అంటే.. హీరో వాళ్ళ కుటంబాన్ని రక్షించడం లేదా హీరో సమాజనికి ఏదో సందేశం ఇచ్చే పనిలోపడటం. ఇంకా పాత సినిమాలకు వెళ్తే హీరో ఫ్యామిలిని ఎక్కడో బంధిస్తారు మన హీరో వెళ్ళి వాళ్ళను విడిపించి శుభం టైటల్స్ వేయిస్తాడు. ఇప్పుడు వస్తున్న సినిమాలు కూడా కొన్ని సినిమాలలో కూడా యాక్షన్ ఎపిసోడ్ తోనే శుభం కార్డ్ పడుతుంది. కానీ కొన్నేళ్ళ కిందట వచ్చిన అత్తారింటికి దారేది సినిమా మాత్రం ఆ పాత పద్దతి కి చరమ గీతం పాడేసిందనే చెప్పాలి. దటీజ్ త్రివిక్రమ్.
పవర్ స్టార్ వంటి పెద్ద హీరోను పెట్టుకొని ఒక రైల్వే స్టేషన్లో మనసులోని ఆవేదనను మాత్రమే చూపించి ముగింపు పలికాడు త్రివిక్రమ్. ఈ పతాక సన్నివేశంలో పవన్ నటన ఆ సినిమాకే స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది. మంచి కథ చెప్పడంలో మాటల మాంత్రికుడు బాగా నైపుణ్యం సంపాదించాడు. ఈ సినిమా విజయం తరువాత కొన్ని సినిమాలు ఇలానే ప్రయత్నం చేశాయి. కానీ ఏవి కూడా అత్తారింటికి దారేది స్థాయి విజయం పొందలేదు. మనసు భావాన్ని మాటలలో మెత్తగా చెప్పే మతలబు త్రివిక్రమ్ చేయినంతగా మరి ఎవరు చేయలేరేమో అనిపిస్తుంది.
ఇప్పుడు మళ్ళీ పవన్ కల్యాణ్ త్రివిక్రం కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా అత్తారింటికి దారేది సినిమాలాంటి మంచి మాటలతో సినిమాలో ఉన్న ప్రతి వారూ ఉండేలా ఒక పతాక సన్నివేశం చేస్తునట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ ఈ సినిమా కోసం పదునైన మాటలు పొంచి ఉంచాడంట. రామోజీ ఫిల్మ్ సిటిలో ఇప్పుడు పవన్ కల్యాణ్ క్లైమాక్స్ సీన్ షూటింగ్ జరుగుతోంది. అంటే మరోసారి మాటలు పవర్ తో హిట్ కొట్టడానికి సిద్దం చేస్తున్నారు అన్నమాట