Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jan-2016 17:51:40
facebook Twitter Googleplus
Photo

'నాన్నకు ప్రేమతో' విడుదల ఒక రోజు ఉందనగా ఆ సినిమాకు పరోక్ష వివాదం ఒకటి చుట్టుకుంది... సినిమాతో ఎలాంటి సంబంధం లేకపోయినా నిర్మాతపై ఫిర్యాదు రావడం ఇప్పడు సంచలనంగా మారింది. పైగా ఆ ఫిర్యాదు చేసింది ఎవరో చిన్నాచితకా వ్యక్తి కాదు... పవన్ కళ్యాణ్ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నాన్నకు ప్రేమతో నిర్మాత బీవీఎస్ ఎస్ ప్రసాద్ - పవన్ కల్యాణ్ మధ్య ఈ వివాదం చాలాకాలంగా నడుస్తోంది. ఇప్పుడది ముదిరి పాకాన పడింది.

అత్తారింటికి దారేది సినిమా పారితోషికం విషయంలో బీవీఎస్ ఎన్ ప్రసాద్ కు పవన్ కు మధ్య వివాదం ఉంది. పవన్ కు ఆ సినిమా రెమ్యూనరేషన్ లో ఇంకా 2 కోట్లు బాకీ ఉన్నాడు ప్రసాద్. ఆ విషయంపైనే ఇప్పుడు 'మా' అసోసియేషన్ లో ఫిర్యాదు చేశాడు. అత్తారింటికి దారేది సినిమా పూర్తయిన తరువాత కూడా ప్రసాద్ రెండు కోట్ల మొత్తాన్ని పవన్ కు ఇవ్వకుండా పెండింగ్ పెట్టారు. నాన్నకు ప్రేమతో సినిమా సమయంలో మిగతా రెమ్యునరేషన్ ఇస్తానని ప్రసాద్ అప్పట్లో మాట ఇవ్వడంతో పవన్ ఊరుకున్నారు. అయితే... నాన్నకు ప్రేమతో రేపు రిలీజ్ కాబోతున్నా తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇంకా ఇవ్వడంలేదని పవన్ తాజాగా కంప్లయింట్ చేశారు. ఈ ఫిర్యాదును మా అసోసియేషన్ నిర్మాతల మండలికి పంపింది.

అత్తారింటికి దారేది సినిమా సమయంలో పైరసీ వ్యవహారం పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నిర్మాత బీవీఎస్ ఎన్ కు నష్టం కలగకూడదన్న ఉద్దేశంతో దర్శకుడు త్రివిక్రమ్ - హీరో పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ ను సినిమా రిలీజ్ తర్వాత తీసుకుంటామని మాట ఇచ్చారట. అయితే సినిమా రిలీజై ఘన విజయం సాధించినా పవన్ కు మాత్రం డబ్బులు ఇవ్వలేదు. అదేమిటని పవన్ ప్రశ్నించగా నాన్నకు ప్రేమతో సినిమా విడుదల సమయంలో చెల్లిస్తానని ప్రసాద్ మాట ఇచ్చారట. కానీ ఆ సినిమా రేపు రిలీజవుతున్నా ఇంతవరకూ తనకు ఇవ్వాల్సిన రెండు కోట్లు ఇవ్వలేదని పవన్ మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేశారు. నాన్నకు ప్రేమతో రిలీజయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలియదు కాబట్టి తనకు ఇప్పుడే ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరుతున్నారు.

,  ,  ,  ,  ,