అటాక్, శౌర్య వంటి వరుస పరాజయాలతో డీలా పడ్డ మంచు మనోజ్ ఈసారి ఖచ్చితంగా హిట్ అందుకోవాలనే ప్రయత్నంలో వరుసగా రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒక్కడు మిగిలాడు, గుంటూరోడు అనే రెండు సినిమాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో గుంటూరోడు సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ మధ్యే రిలీజైన ఈ చిత్రం తాలూకు ట్రైలర్లు కూడా ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ఆడియో వేడుకను ముందుగా జనవరి 26న చేద్దామని అనుకుని కొని కారణాల వలన దాన్ని వాయిదా వేసిన టీమ్ కొత్త డేట్ ను ఫిక్స్ చేసింది.
ఈ విషయాన్ని మంచు మనోజ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ఆడియో వేడుక జనవరి 29 ఆదివారం నాడు హైదరాబాద్లోని తాజ్ డెక్కన్ లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుందని, అందరూ ఆహ్వానితులే అని మనోజ్ అన్నారు. సత్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా ఫిబ్రవరిలో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే మనోజ్ కొద్ది రోజుల క్రితమే వీరభద్రం చౌదరి డైరెక్షన్లో ఒక సినిమాకి సైన్ చేశాడు