ముకుంద' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ముద్దమందారం పూజా హెగ్డే. ఆ సినిమా తర్వాత తెలుగులో పలు అవకాశాలు వచ్చినప్పటికీ, అప్పటికే హిందీలో కమిట్ అయిన 'మొహంజదారో' సినిమాలో బిజీ కావడం వల్ల ప్రస్తుతం మరే సినిమా ఒప్పుకోవడం లేదు. అయితే, అంతటి బిజీలోనూ ఇప్పుడీ ముద్దుగుమ్మ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆగస్టు 6, 7 తేదీల్లో దుబాయ్ లో గ్రాండుగా జరిగే 'సైమా' అవార్డుల వేడుకల్లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనుంది. 'ముకుంద'లోని 'గోపికమ్మా...' పాటతో బాటు మరికొన్ని పాటలకు కూడా అమ్మడు డ్యాన్స్ చేస్తుందట. ఇందుకు గాను పూజాకు పారితోషికం కూడా బాగానే గిట్టుతోంది.
poojaHegde, performance,