తెలుగు చిత్రపరిశ్రమలో ఇటు నిర్మాతగానూ ... అటు విలక్షణమైన నటిగాను లక్ష్మీ మంచు తన ప్రత్యేకతను చాటుకుంది. ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం పడే ఆరాటమే ఆమెకి ఇంతటి గుర్తింపును ... ఇన్ని విజయాలను అందించాయి. అలాంటి లక్ష్మీ మంచు ప్రధానమైన పాత్రగా ఆ మధ్య 'పిలవని పేరంటం' అనే సినిమా షూటింగ్ ఆరంభమైంది. ఈ సినిమాలో కమెడియన్ ధన్ రాజ్ కూడా ఓ ముఖ్యమైన పాత్రకి ఎంపిక చేయబడ్డాడు. కొన్ని కారణాల వలన అతని కాంబినేషన్ లో నటించడానికి లక్ష్మీ మంచు నిరాకరించడంతో, ధన్ రాజ్ ని ఆ సినిమా నుంచి తప్పించారు.
ఆ తరువాత కూడా ఆ సినిమా చేయడానికి లక్ష్మీ ఆసక్తి చూపించలేదు. దాంతో ఆ పాత్రకి గాను ఆమె స్థానంలో 'పూర్ణ'ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 'అవును' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పూర్ణ బాగా దగ్గరైంది. అలాగే ముందుగా ధన్ రాజ్ కోసం అనుకున్న పాత్రకి మరింత ప్రాధాన్యతను పెంచి, ఈ పాత్ర కోసం వరుణ్ సందేశ్ ని ఎంచుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.