టాలీవుడ్ కి కొత్త గొంతుకలను పరిచయం చేసే యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (DSP) తాజాగా మరో పాప్యులర్ గాయకుడిని పరిచయం చేస్తున్నాడు. ప్రముఖ ఫోక్, ఫ్యూజన్ గాయకుడు రఘు దీక్షిత్ చేత దేవి తొలిసారిగా ఓ తెలుగు పాటను పాడించాడు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో రఘు తాజాగా ఓ కిక్కిచ్చే పాట పాడాడు. ఈ విషయాన్ని తనే ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అలాగే, దేవిశ్రీ ప్రసాద్ తో దిగిన ఫోటో కూడా పోస్ట్ చేశాడు.
alluarjun, trivikram, dsp, raghudixit,