సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. గోపీచంద్ మొదటిసారి ద్విపాత్రాభినయం చేయనున్నాడు. కేథరిన్, హన్సిక కథానాయికలు. ఇదో డిఫరెంట్ కథాంశంతో.. గోపీచంద్ మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెబుతున్నారు. జె భగవాన్, జె. పుల్లారావు నిర్మాతలు
అయితే, తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికి పొక్కింది. ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రబాస్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వనున్నాడట. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందట. ఈ పాత్రని ప్రభాస్ చేస్తే అద్భుతంగా ఉంటుందని దర్శకుడు సంపత్ నంది భావిస్తున్నాడట. గోపీచంద్ ? ప్రభాస్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. వర్షం సినిమా నుంచి వీరు మంచి స్నేహితులుగా మారిపోయారు. గోపీచంద్ అడిగితే ప్రభాస్ కాదనడు. అందుకే ప్రభాస్ ని ఒప్పించే బాధ్యతని గోపీచంద్ పై పెట్టాడు దర్శకుడు సంపత్ నంది. ఒకవేళ ప్రభాస్ ఒప్పుకుంటే.. ఈ చిత్రం పెద్ద చిత్రాల జాబితాలో చేరిపోవడం ఖాయం. ప్రస్తుతం బాహుబలి2 షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ స్నేహితుడి చిత్రంలో నటించేందుకు ఒప్పుకుంటాడో ? లేదో ? చూడాలి.