'రన్ రాజా రన్' సినిమా ద్వారా పరిచయమైన దర్శకుడు సుజిత్ కి హీరో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇటీవల కలసి ప్రభాస్ కి స్టోరీ లైన్ చెప్పడంతో ఆయన వెంటనే ఓకే చెప్పి, స్క్రిప్టు సిద్ధం చేయమని చెప్పాడట. ఇది యాక్షన్ రొమాన్సుతో సాగుతుందని దర్శకుడు చెబుతున్నాడు. "ఈ స్టోరీ లైన్ ప్రభాస్ కి బాగా నచ్చింది. స్క్రీన్ ప్లేతో కూడిన స్క్రిప్టు సిద్ధం చేయమని ప్రభాస్ చెప్పారు. ప్రస్తుతం ఆ పనిలోనే వున్నాను. త్వరలోనే బౌండెడ్ స్క్రిప్టు అందజేస్తాను" అంటున్నాడు సుజిత్. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేసే సినిమా ఇదే అవుతుందని ప్రభాస్ సన్నిహితులు చెబుతున్నారు.
prabhas, sujith, uvcreations, tollywood, newmovie, action,