ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇటీవలే ఈ సినిమా క్లైమాక్స్ కూడా పూర్తయ్యింది. మరికొద్ది రోజుల్లో మొత్తం షూటింగ్ పూర్తికనుంది. అయితే, ఈ చిత్రం తర్వాత ప్రభాస్ ?రన్ రాజా రన్ ఫేమ్? సుజిత్ దర్వకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అన్నిపనులు పూర్తి చేసుకొని రెడీగా ఉన్నాడు సుజిత్. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది.
ఈ చిత్రంలో ప్రభాస్ స్టయిలీష్ లుక్ తో కనిపించనున్నాడట. ప్రభాస్ కోసం పలు ఖరీదైన మోడరన్ కార్టను ఉపయోగిస్తారని టాక్. ప్రస్తుతం ఈ కార్ల సమీకరణలో ఉన్నాడంట సుజీత్ అండ్ టీం. ఈ మోడరన్ కార్లు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని చెబుతున్నారు.
మరోవైపు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బాహుబలి2 లో ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా,రమ్య కృష్ణ, సత్యరాజ్ .. తదితరులు ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి. అన్నట్టు.. ఈ చిత్రం వచ్చే యేడాది ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు