ఒక వైపున రజనీకాంత్ తో 'రోబో 2' సినిమాకి దర్శకుడు శంకర్ ఏర్పాట్లు చేసుకుంటూ వుండగా, మరో వైపున రజనీతో సినిమాకి దర్శకుడు రంజిత్ సన్నాహాలు చేస్తున్నాడు. ఆగస్టు 1న సెట్స్ పైకి వెళుతోన్న ఈ సినిమా తక్కువ కాలవ్యవధిలో షూటింగును పూర్తిచేసుకోనుంది. అందువలన ప్రస్తుతం రజనీ ఈ సినిమాపై దృష్టిపెట్టాడు. అయితే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ జరిగిన తరువాత, ఇందులో కథానాయిక ఉండదనే ప్రచారం బాగా జరిగింది. అందులో నిజం లేదన్నట్టుగా ఈ సినిమాలో కథానాయికగా విద్యాబాలన్ ని ఎంపిక చేశారనే వార్త షికారు చేస్తోంది.
తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాలో తన వయసుకి తగిన గ్యాంగ్ స్టర్ పాత్రలో రజనీకాంత్ కనిపించనున్నాడు. ఆ పాత్రకి తగిన జోడీగా ఎవరైతే బాగుంటారనే విషయంగా కొంతమంది కథానాయికలను పరిశీలించి, చివరికి విద్యాబాలన్ ని ఎంపిక చేశారని అంటున్నారు. అదే నిజమైతే దీపికా పదుకొనే .. సోనాక్షీ సిన్హా ఆ తరువాత విద్యాబాలన్.. ఇలా రజనీ వరుసగా బాలీవుడ్ కథానాయికలతో నటిస్తుండటాన్ని విశేషంగా చెప్పుకోవచ్చు.