ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న డ్యాన్సర్, సినీ నటుడు, దర్శకుడు ప్రభుదేవా హాస్పటల్ లో జాయిన్ అయ్యాడు..వివరాల్లోకి వెళ్తే..అభినేత్రి చిత్రం కోసం డాన్స్ కంపోజ్ చేస్తుండగా ఒక్కసారిగా వెన్నునొప్పి రావడంతో స్పాట్లోనే ప్రభుదేవా కుప్పకూలాడు. దీంతో ప్రభుదేవాని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం డాక్టర్స్ అతడిని కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని సూచించారట.
ప్రభుదేవా , సోను సూద్, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న అభినేత్రి చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషలలో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుండగా ప్రభుదేవా కు ఈ ప్రమాదం జరిగింది.