తెలుగులో వచ్చిన అంకుశం సినిమాతో రాజశేఖర్ యాంగ్రీ హీరోగా అవతరించాడు. ఇప్పుడు మళ్ళీ అప్పటి ఆవేశం తిరిగి చూపించడానికి పిఎస్వి గరుడవేగ 126.18m తో మనముందుకు వస్తున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ అనుసారం బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారు నిర్మాణ సంస్థ అండ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. ఈ సినిమాకు కావలిసిన సాంకేతిక అవసరాల వలన అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయ్యిందట.
ఈ మధ్యనే ప్రొడక్షన్ యూనిట్ అంతా కలిసి ఒక విశేషమైన క్షణాలను ఆనందంగా గడిపేశారు. 40 రోజుల లాంగ్ షెడ్యూల్ ను జార్జియాలో చాలా కష్టమైన వాతావరణంలో షూట్ చేసి మొత్తానికి విజయవంతంగా పూర్తి చేశాం. స్క్రిప్ట్ ను అందరూ బాగా నమ్మి సినిమాను చేస్తున్నాము కాబట్టి మా యూనిట్ అంతా ఇంతలా సహకారం అందిస్తున్నారు అంటున్నాడు డైరెక్టర్ ప్రవీణ్. కాకపోతే ఈ సినిమా కోసం బడ్జెట్ పెరిగిన విషయంపై మనోడు కామెంట్ మాత్రం చేయట్లేదు. పిఎస్ వి గరుడవేగ 126.18m లో రాజశేఖర్ ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారిగా నటిస్తున్నారు. రాజశేఖర్ సినిమాలు అన్నింటి కన్నా ఈ సినిమా బడ్జెట్ ఎక్కువ అనే చెప్పాలి. ఈ సినిమా సుమారుగా 25 కోట్లు వ్యయం తో నిర్మిస్తున్నట్లు తెలిసింది. కాని రాజశేఖర్ ఇప్పుడు హీరోగా అంతటి బడ్జెట్ ను బాక్సాఫీస్ దగ్గర ఎలా వర్కవుట్ అవుతుందనేదే పెద్ద విషయం.