Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Feb-2017 12:22:08
facebook Twitter Googleplus
Photo

మాస్ దర్శకుడు పూరీ జగన్నాధ్ ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. వరుస పరాజయాలు పూరీ ఇమేజ్ మీద బాగానే దెబ్బ కొట్టాయి. సినిమా ఆఫర్ల రాని పరిస్థితి అయితే లేదు కానీ.. స్టార్ హీరోలు మొహం చాటేస్తున్నారు. మరోవైపు సీనియర్ హీరో వెంకటేష్.. బాబు బంగారంతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు.

ప్రస్తుతం పూరీ జగన్నాధ్ తాను గతంలో మొదలుపెట్టిన రోగ్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. మహాత్మ నిర్మాత కొడుకు ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తుండగా.. ప్రస్తుతం ఈ మూవీ ఫినిషింగ్ స్టేజ్ లో ఉందని తెలుస్తోంది. అందుకే వెంకీతో అనుకున్న ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోందని.. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయని అంటున్నారు. వెంకీ-పూరీలు కలిసి ఓ భారీ బడ్జెట్ మూవీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

గతంలో మహేష్ బాబుతో జన గణ మన సినిమా చేస్తానంటూ ట్విట్టర్ సాక్షిగా అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు పూరీ. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. పూరీ ట్రాక్ బ్యాడ్ గా ఉండడంతోపాటు.. మహేష్ లైన్ లో పెట్టిన సినిమాలే చాలా ఉన్నాయి. జన గణ మన సబ్జెక్ట్ ని వెంకీకి చెప్పిన పూరీ.. ఇప్పటికే ఓకే అనిపించేసుకున్నాడట. ప్రస్తుతం గురు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు వెంకీ. రోగ్ ని విడుదల చేసేందుకు యత్నిస్తున్నాడు పూరీ. వీటి సంగతి ఓ కొలిక్కి రాగానే.. వీళ్లిద్దరి కాంబినేషన్ పై అనౌన్స్ మెంట్ రానుందని టాక్.

,  ,  ,  ,  ,