బాహుబలి తర్వాత జక్కన్న పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. ఈ దిగ్గజ దర్శకుడి దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు తీసిన చిత్రాలపై కూడా ప్రేక్షకులకు భారీ అంచనాలుండడం సహజం. అయితే రాజమౌళి దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు మాత్రం ఆ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ఒకరో ఇద్దరో కాదు ఇప్పటి వరకు ఆరుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు విఫలయ్యారు. వారందరికీ తమ తొలి ప్రయత్నాలు చేదు అనుభవాలను మిగిల్చాయి. తాజాగా రాజమౌళి శిష్యుడు పళని దర్శకత్వం వహించిన ఏంజెల్ చిత్రం మిక్సీడ్ టాక్ ను సొంతం చేసుకుంది.
పళని ....బాహుబలి చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. సోషియో ఫాంటసీ కథాంశంతో హెబ్బాపటేల్ లీడ్ రోల్ లో ఏంజెల్ ను తెరకెక్కించాడు. ఆ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే మిక్సీడ్ టాక్ తెచ్చుకుంది. రాజమౌళి శిష్యుడిగా భారీ అంచనాలున్న పళని...హిట్ కొట్టడంలో ఫెయిల్ అయ్యాడు. అదేవిధంగా జక్కన్న దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన ఐదుగురు దర్శకులు తీసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. మహదేవన్(జాగ్వర్) జగదీశ్ తలశిల(లచ్చిందేవికి ఓ లెక్కుంది) త్రికోటి(దిక్కులు చూడకు రామయ్య) డీఎస్ కణ్ణన్(సారాయి వీర్రాజు) కరుణ కుమార్(ద్రోణ) లు డిజాస్టర్లతో అరంగేట్రం చేశారు. దర్శక ధీరుడి దగ్గర పనిచేసినప్పటికీ వీరందరూ విజయాలను అందుకోలేకపోయారు.