దర్శకుల కుమారులు ఈ మధ్య కాలంలో అంతగా ఎంట్రీ ఇవ్వడం లేదు. ఒకవేళ ఇచ్చినా అనుకున్నంతగా రాణించలేకపోతున్నారు. అయితే ప్రస్తుతం ఒక దర్శకుడి కొడుకు సినిమాపై అంచనాలు మాత్రం బాగా పెరుగుతున్నాయి. అతను ఎవరో ఇప్పటికే అర్ధమై ఉంటుంది. ఆకాష్ హీరోగా తెరకెక్కుతోన్న మెహబూబా సినిమాపై ప్రస్తుతం ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
అందులోను పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తుండడంతో సినిమా తప్పకుండా బావుటుంది అనే భావనతో ఉన్నారు. అంతే కాకుండా సినిమా ఇండో-పాక్ నేపథ్యంలోని లవ్ స్టోరీ కావడంతో పూరీ కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాడని చర్చలు సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు సినిమాకు సంబందించిన అప్డేట్స్ ని ప్రొడక్షన్ హెడ్.. మాజీ హీరోయిన్ ఛార్మి అందిస్తూనే ఉంది. రీసెంట్ గా హిమాచల్ ప్రదేశ్ లో ఒక భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ రీసెంట్ గా హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది.
అయితే షూటింగ్ లో పూరి జగన్నాథ్ చిత్ర యూనిట్ తో కలిసి ఒక ఆటోలో దర్శనం ఇచ్చాడు. ఒక ఆటో రైడింగ్ సిన్ ను చిత్రీకరించిన అనంతరం దిగిన ఆ పోటోను ఛార్మి తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. అంతేకాదు.. సిటీలో మేం ఎక్కడన్న కనిపిస్తామేమో పట్టుకోండి అంటోంది కూడాను. ఒక మంచి లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.