సినిమా ఓ మాదిరిగా అయినా ఆడుతోందంటే అది బాలయ్య వల్లే కానీ.. గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాక కూడా బాలయ్య వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరితో సినిమా ఎందుకు చేశాడని ప్రశ్నిస్తున్నారు. ఐతే పైసా వసూల్ విషయంలోనే బాలయ్య తప్పటడుగు వేశాడనుకుంటుంటే.. ఈ సినిమా ఫలితం చూశాక కూడా బాలయ్య పూరితో ఇంకో సినిమా చేయడానికి రెడీ అవడం చూసి మరింత ఆశ్చర్యపోతున్నారు. పైసా వసూల్ విడుదలకు ముందు బాలయ్య-పూరి కాంబినేషన్లో ఇంకో సినిమా ఉంటుందని.. అదో పొలిటికల్ డ్రామా అని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
అది ఊహాగానమే అనుకుంటే.. స్వయంగా పూరినే బాలయ్యతో తాను మరో సినిమా చేయబోతున్నట్లు ఇప్పుడు కన్ఫమ్ చేశాడు. పైసా వసూల్ చేస్తున్నపుడే తన 103వ సినిమాకు తానే దర్శకుడినని బాలయ్య స్పష్టం చేసినట్లు పూరి వెల్లడించాడు. పైసా వసూల్ ఫలితం వచ్చే వరకు ఆగుదామని తాను అన్నప్పటికీ.. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్న 103వ సినిమాను తన దర్శకత్వంలోనే చేస్తానని బాలయ్య చెప్పినట్లు పూరి వెల్లడించాడు. ఆ సినిమా మొదలయ్యే లోపు తాను తన కొడుకు ఆకాష్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యత తీసుకోనున్నట్లు పూరి తెలిపాడు.