తాజాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'ముకుంద' చిత్రాన్ని చేసిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ త్వరలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సి. కల్యాణ్ తెలిపారు. ఇది వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. అలాగే, కొత్త సంవత్సరంలో పలు భారీ చిత్రాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు కల్యాణ్ తెలిపారు. నితిన్ తో ఒక సినిమా, నాగచైతన్య తో ఒక సినిమా ప్లానింగులో వున్నాయని చెప్పారు. 'కేడీ' సినిమా తర్వాత నాగార్జునతో ఓ సినిమా నిర్మించాల్సివుందనీ, సరైన కథ దొరకక ఇంకా సెట్స్ కి వెళ్ళలేదనీ అన్నారు. ఇటీవలే నాగార్జున కోసం... నలుగురు అమ్మాయిల మధ్య హీరో అనే కాన్సెప్టుతో ఓ కథ విన్నానని ఆయన తెలిపారు. ఇది నాగార్జునకు బాగా సూటవుతుందని చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా తమకు వచ్చే ఏడాది ఓ సినిమా వుందని నిర్మాత కల్యాణ్ తెలియజేశారు.
purijagannadh, varuntej, ckalyan, tollywood, 2015,