చెప్పడానికి బోల్డన్నీ కథలున్నాయ్.. అనుకున్న టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే సత్తా ఉంది.. కానీ వినడానికే హీరోలు సిద్ధంగా లేరు. ఇది పూరీ సిట్యువేషన్ ఇప్పుడు. ఇన్నాళ్లూ యంగ్ హీరోలు.. స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్లతోనే వర్క్ చేసిన జగన్నాథ్ ఇప్పుడు సెంచరీ హీరో బాలక్రిష్ణ వైపు చూస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది.
ఇజమ్ తర్వాత పూరీ మహేష్ తో సినిమా ఉంటుందన్నాడు. జనగణమన అంటూ మహేష్ పిక్చర్ ఒకటి యాడ్ చేసి టైటిల్ లోగో కూడా రిలీజ్ చేశాడు. కానీ ఏమైందో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి వినిపించడం లేదు. మరోవైపు రామ్ తో పూరీ మూవీ తీస్తున్నాడన్నారు అది కూడా సైలెంటైపోయింది. ఇజమ్ రిజల్ట్ పాజిటివ్ గా ఉంటే పూరీతో జూనియర్ ఎన్టీఆర్ ఇంకో మూవీ కమిటయ్యే వాడేమో కానీ ఇప్పుటికైతే సైడైపోయాడు. అందుకే వీళ్లతో పెట్టుకుంటే వర్కౌట్ అవదని ఫిక్సైన పూరీ బాలక్రిష్ణని ఎలాగైనా ఒప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నాడట.
వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణితో బిజీగా ఉన్న బాలయ్య.. తర్వాత క్రిష్ణవంశీ తీయనున్న రైతులో యాక్ట్ చేయనున్నాడు కాని.. అదీ ఇంకా కన్ఫామ్ కాలేదు. సో ఈ గ్యాప్ లో బాలక్రిష్ణతో ఎలాగైనా మూవీ చేయాలనేది పూరీ ఆలోచన. ఫాస్ట్ గా మూవీస్ తీయడం పూరీకి అలవాటే కాబట్టి బాలక్రిష్ణ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే మూవీ ఫినిష్ చేయడం మేటర్ కాదు. అయితే పూరీ ఇప్పుడు ఫామ్ లో లేని బ్యాట్స్ మెన్ లా ఉన్నాడు. ఇలాంటి సమయంలో బాలయ్య రిస్క్ చేస్తాడా అనేదే అసలు డౌట్.