శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ రాధ. రన్ రాజా రన్ మూవీ నుంచి వరుసగా సక్సెస్ లు సాధిస్తున్న ఈ హీరో.. ప్రతీ మూవీకి తన సక్సెస్ స్థాయిని పెంచుకుంటున్నాడు. ఈ ఏడాది వచ్చిన శతమానం భవతి.. 30 కోట్లకు పైగా షేర్ సాధించి ఓ అనూహ్యమైన మైలురాయిని అందుకున్న మీడియం బడ్జెట్ మూవీగా నిలిచింది.
ఇప్పుడు కొత్త దర్శకుడు చంద్రమోహన్ రూపొందించిన రాధ మూవీని.. మే 12న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు శర్వానంద్. నిజానికి ఈ మూవీ ఉగాది నాటికే రిలీజ్ కి రెడీ అయినా.. సమ్మర్ కి వాయిదా వేసుకున్నారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణంలో.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై రూపొందిన ఈ మూవీ.. బాహుబలి2 తర్వాత విడుదల కానుండడంతో.. ఆ అడ్వాంటేజ్ ను కూడా ఎంజాయ్ చేయనుంది. ఫస్ట్ లుక్ పోస్టర్.. టీజర్లకు వచ్చిన రెస్పాన్స్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రస్తుతం టీం అంతా మిలాన్ లో ఓ పాట షూటింగ్ లో ఉన్నారు. త్వరలో ఆడియో రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తాం అన్నారు నిర్మాత.
చంద్రమోహన్ మంచి ఎంటర్టెయినర్ ను అందించాడు. రొమాన్స్.. యాక్షన్.. కామెడీ.. అన్నీ కలగలిసిన ఎంటర్టెయిన్మెంట్ మూవీకి విజయం అందించనున్నాయి. క్లాస్ మాస్ అందరూ మెచ్చే సినిమా రాధ అన్నారు బీవీఎస్ ఎన్ ప్రసాద్.