'ఉయ్యాల జంపాల' సినిమాతో హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్ తన మూడో సినిమాకు సంతకం చేశాడు. నూతన దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ మార్చి మూడో వారం నుంచి జరుగుతుంది. ఇది వైవిధ్యభరితమైన వినోద ప్రధాన చిత్రంగా రూపొందుతుందని దర్శకుడు చెప్పాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయన్నారు. ఇదిలా ఉంచితే, రాజ్ తరుణ్ ప్రస్తుతం 'సినిమా చూపిస్త మావా' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీనికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు.
rajtarun, newmovie, tollywood, news,