దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సుదీర్ఘంగా తెరకెక్కించిన బాహుబలి ప్రాజెక్టుకు లాస్ట్ వర్కింగ్ డే చెప్పేశాడు. బాహుబలి కోసం ఇక తను చేయాల్సింది ఏమీ లేదని.. బ్యాక్ గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయిందని తేల్చేశాడు. ఇక బాహుబలి2 పబ్లిసిటీ పనులు ఇప్పటికే ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో రాజమౌళి తర్వాతి సినిమా ఏం చేస్తాడనే ఆలోచనలో ఎలాంటి మిస్టేక్ లేదు.
ఎన్టీఆర్.. మహేష్ బాబు.. ప్రభాస్.. ఇలా రాజమౌళి తర్వాతి సినిమాలో హీరో అంటూ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే.. ఓ పేరుకు జనాలు ఫిక్స్ అయిపోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ తో జక్కన్న సినిమా చేయనున్నాడనే అంచనాకి రావచ్చు. ఇందుకు పలు రీజన్స్ ఉన్నాయి. గత కొన్ని రోజుల్లో జరిగిన పరిణామాలే ఇందుకు కారణం.
కొన్ని రోజుల క్రితం తన భర్త తీసిన సినిమాల్లో యమదొంగ తనకు అసలు నచ్చని మూవీ అంటూ రమా రాజమౌళి చెప్పారు. ఆ తర్వాత సింహాద్రి అసలు ఎన్టీఆర్ కోసం రాసిన సబ్జెక్ట్ కాదంటూ.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తేల్చేశారు. అసలు వీళ్లిద్దరూ ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ హిట్స్ ని టచ్ చేయాల్సిన అవసరం ఏంటన్నదే అసలు సిసలైన పాయింట్. సింహాద్రి మూవీ ఎన్టీఆర్ ని స్టార్ చేసింది. యమదొంగ సాధించిన సక్సెస్ తో.. ఎన్టీఆర్ మళ్లీ హిట్ పట్టాలెక్కాడు.
అలాంటి రెండు సినిమాలను.. సింపుల్ గా జక్కన్న టీం ఆడేసుకున్నారు. ఇదంతా ముందస్తు ప్లాన్ లో భాగంగానే జరుగుతున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఇప్పుడు అప్పటి ఎన్టీఆర్ సినిమాలను ఇప్పుడు రాజమౌళి టీం ప్రస్తావించాల్సిన అవసరమేమీ లేదు. అయినా సరే కావాలనే ఇలా చేస్తున్నారంటే.. ముందుగా రాజమౌళి- ఎన్టీఆర్ కాంబోపై హైప్ తగ్గించి.. చివరకు అసలు విషయం మెల్లగా చల్లగా చెబుతారన్న మాట.