బాహుబలి?తో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన దర్శక ధీరుడు రాజమౌళి, దానికి కొనసాగింపైన ?బాహుబలి ది కంక్లూజన్?తో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ?బాహుబలి?ని మించేలా, అత్యున్నత సాంకేతిక విలువలు, భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం కొద్దినెలలుగా టీమ్ అన్ని పరిస్థితులనూ ఎదుర్కొంటూ కష్టపడుతోంది. ఇక ఏప్రిల్ నెలలో ఎండలు మండిపోతోన్నా టీమ్ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని యాక్షన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తోంది.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతోన్న ఈ షెడ్యూల్ మరికొద్దిరోజుల్లో పూర్తి కానుండగా, ఆ తర్వాత నుంచి, టీమ్ మొత్తానికి రాజమౌళి ఓ నెలరోజుల పాటు సెలవు ప్రకటించారు. నెలరోజుల పాటు టీమ్ వేసవి సెలవులపై విశ్రాంతి తీసుకోనుంది. ఇక ఆ తర్వాత మళ్ళీ నిరంతారయంగా షూటింగ్ జరపనున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా 2017 ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.