ఒకప్పుడు చిరంజీవి అంటే రాజశేఖర్ అంతెత్తున లేచేవారు. ఏ చిన్న అవకాశం దొరికినా ఆయనని విమర్శించడానికి రెడీ అయిపోయేవారు. అయితే, ఇటీవల వీరి మధ్య సఖ్యత ఏర్పడిందనీ, నాగబాబు వీరిని కలిపాడనీ వార్తలొచ్చాయి. అందుకు తగ్గట్టుగానే రాజశేఖర్ ఇప్పుడు చిరంజీవిపై ఎంతో అభిమానం కురిపిస్తున్నాడు. తన తాజా చిత్రం 'గడ్డం గ్యాంగ్' ప్రీమియర్ షోకి చిరంజీవిని ఆహ్వానిస్తున్నట్టు రాజశేఖర్ తాజాగా మీడియాకు తెలిపారు. "చిరంజీవిగారు చూస్తానంటే కనుక ఆయనకు స్పెషల్ షో ఏర్పాటు చేస్తాను" అంటున్నాడు రాజశేఖర్. కాగా, ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజవుతోంది.
rajashekar, gaddamgang, chiranjeevi, tollywood, news,