గత ఏడాదిన్నరగా తన కొత్త సినిమాను ప్రకటించకుండానే వచ్చిన రవితేజ, ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలను మొదలుపెట్టేశారు. ఈ రెండు సినిమాల్లో టచ్ చేసి చూడు ఇప్పటికే సెట్స్పైకి వెళ్ళగా, నేడు పూజా కార్యక్రమాలు జరుపుకున్న మరో సినిమా రాజా ది గ్రేట్ మార్చిలో సెట్స్పైకి వెళ్ళనుంది. దిల్రాజు నిర్మిస్తోన్న రాజా ది గ్రేట్ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. పటాస్, సుప్రీమ్ లాంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అనిల్, మొదట ఈ కథను హీరో రామ్కు చెప్పారు.
రామ్ కూడా తన 15వ సినిమాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయనున్నానని, అందులో తనది అంధుడి పాత్ర అని కూడా స్పష్టం చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోవడంతో, అదే కథను అనిల్, రవితేజకు చెప్పగా, ఆయన వెంటనే ఒప్పుకున్నారట. దీంతో రవితేజకు తగ్గట్టు కొన్ని మార్పులు చేసేసి అనిల్ ఈ సినిమాను మొదలుపెట్టేశారు. పోస్టర్స్లోనే హీరో ఇందులో అంధుడిగా కనిపిస్తాడని చెప్పడంతో రామ్ ఓకే చేసిన కథతోనే రవితేజ సినిమా తెరకెక్కుతోందని స్పష్టమైంది.