రియలిస్టిక్ సినిమాలతో తమిళనాట సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా రంజిత్ తెరకెక్కిస్తోన్న గ్యాంగ్స్టర్ సినిమా ?కబాలి?. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా విడుదలకు సంబంధించి దర్శకనిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మాకు అందిన సమాచారం ప్రకారం జూన్ 3న కబాలి విడుదల చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు.
అలాగే మే 1న ఒక నిమిషం నిడివి గల ?కబాలి? టీజర్ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా షూటింగ్ అధికభాగం మలేషియాలో సాగడంతో అక్కడ ఆడియో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో రాధికా ఆప్టే, ధన్సికా, కలైరాజన్, దినేశ్, నాజర్ తదితరులు నటిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తుండగా జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు