సౌత్ ఇండియా స్టార్ హీరోల్లో ఒకరైన మహేష్ బాబు, క్రేజీ దర్శకుడు మురుగదాస్ ల కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో మహేష్ సరసన మొదటా పరిణితి చోప్రా ను అనుకున్నప్పటికీ కుదరక రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా ఒకే చేశారు. మహేష్ బాబుతో సినిమా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ కూడా ఒకరు.
అందుకే దర్శకుడి నుండి ఫోన్ కాల్ రాగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒకే చెప్పేసింది రకుల్. ఊహించని భారీ అవకాశం వెతుక్కుంటూ రావడంతో ఎలాగైనా సినిమాకి నూటికి నూరు శాతం న్యాయం చెయ్యాలన్న ఉద్దేశ్యంతో రకుల్ ప్రీత్ తన పాత్రలో పర్ఫెక్షన్ కోసం ఆ పాత్రకు తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ ను తయారు చేసుకోవడానికే గ్రౌండ్ వర్క్ చేస్తోందట. ఈ మధ్యనే ప్రారంభమైన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ త్వరలో పాల్గొననుంది. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ?హరీశ్ జయరాజ్? సంగీతాన్ని అందిస్తున్నారు.