ప్రస్తుతం ధ్రువ షూటింగ్తో బిజీగా ఉన్నాడు రామ్చరణ్. ఆ తరవాత సుకుమార్ సినిమా పట్టాలెక్కుతుంది. సుక్కు సినిమా పూర్తవ్వగానే ఎవరితో సినిమా చేయాలన్న విషయంలో ఆ మధ్య రామ్చరణ్ ఓ క్లారిటీకి ఇచ్చాడు. ?గౌతమ్ మీనన్ తో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్నా. కధ కూడాసెట్టయ్యింది. సుకుమార్ సినిమా తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది?అని చెప్పాడు ఓ ఇంటర్వ్యూలో.
అయితే ఇప్పుడు ఈక్వేషన్ మారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ లైన్ లోకి దర్శకుడు మేర్లపాక గాంధీ వచ్చాడని అంటున్నారు. సుక్కు సినిమా తర్వాత గాంధీ సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్ళే అవకాశం వుందని చెబుతున్నారు. ఐతే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఒకవేళ గాంధీ సినిమా ఓకే అయినట్లయితే ?గౌతమ్ మీనన్ సినిమా వుటుందా లేదా అన్నదానిపై క్లారిటీ క్లారిటీ రావాల్సివుంది.