మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కొత్తగా దర్శకుడు సుకుమార్ తో తన 11వ చిత్రాన్ని మొదలుపెట్టనున్న సంగతి తేలిసిందే. ధృవ విజయం తర్వాత ఆయన చేస్తున్న చిత్రం కావడం, నాన్నకు ప్రేమతో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అభిమానులు, ప్రేక్షకుల్లో ఇప్పటి నుండే మంచి అంచనాలు మొదలయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో చరణ్ తో కలిసి నటించబోయే హీరోయిన్ ఎవరనే దానిపై కొన్నిరోజులుగా తర్జన భర్జనలు జరిగి ఎట్టకేలకు ఒకరు ఫైనలయ్యారు.
ఆమే స్టార్ హీరోయిన్ సమంత. పెళ్లి ఫిక్సయినప్పటి నుండి సమంత తెలుగులో సైన్ చేసిన మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. పైగా సమంత, చరణ్ కలిసి చేయనున్న మొదటి చిత్రం కూడా ఇదే. ఈ చిత్రాన్ని ఈ నెల 30న ప్రారంభోత్సవం జరిపి ఫిబ్రవరి 15 నుండి రెగ్యులర్ షూట్ మొదలుపెడతారట. ఇకపోతే గ్రామీణ నైపథ్యంలో సాగే ప్రేమ కథగా ఉండనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ సంగీతం అందించనుండగా రత్నవేలు సినిమాటోగ్రఫీ భాద్యతలు నిర్వహించనున్నారు.