Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Mar-2016 15:14:30
facebook Twitter Googleplus
Photo

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కోలీవుడ్ మూవీ తని ఒరువన్ రీమేక్ తెరకెక్కుతోంది. తెలుగులో ఈచిత్రానికి ధృవ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా.. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ మాత్రం ఇదే. చరణ్ లేకుండానే షూటింగ్ పనులు ప్రారంభించేసిన దర్శకుడు.. ప్రధాన నటులపై సన్నివేశాలను తీశారు. ఆ తర్వాత చెర్రీ కూడా యూనిట్ కి జతయ్యాడు.

రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా.. తని ఒరువన్ లో విలన్ పాత్ర పోషించిన అరవింద్ స్వామినే విలన్ గా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ యూనిట్ బ్యాంకాక్ షెడ్యూల్ కు వెళ్లిపోయింది. అరవింద్ స్వామితో పాటు ఇతర సభ్యులపై ప్రధాన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. అయితే.. ఈ మూవీని ఆగస్ట్ 12న విడుదల చేయాలని ముందుగా అనుకున్నా.. ఇప్పుడా డేట్ మారింది.

ఇప్పుడ ధృవను జూలై 31కే విడుదల చేయాలని నిర్ణయించారని సమాచారం. ఈ జూలై 31తో చెర్రీకి పాత అనుబంధం ఉంది. చెర్రీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మగధీర రిలీజ్ డేట్ అదే. అందుకే ఆ రోజును సెలక్ట్ చేసుకున్నారని అంటున్నారు. గతంలో ఎవడు చిత్రాన్ని కూడా జూలై 31కే షెడ్యూల్ చేసినా.. అది ఆరు నెలలు వాయిదా పడింది. మరి మగధీర ఇచ్చిన మంచి సెంటిమెంట్ ఎవడు ఇచ్చిన బ్యాడ్ సెంటిమెంట్.. ఈ రెండింటినీ పరిశీలించి చివరకు జూలై 31కే రామ్ చరణ్ మొగ్గుచూపుతున్నాడని అంటున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,