మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ?ధృవ? సినిమా ప్రస్తుతం హైద్రాబాద్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ స్పాట్లో రామ్ చరణ్ను కలిసే అవకాశాన్ని టీమ్ ఆయన అభిమానులకు కల్పిస్తోంది. ?మై డబ్ ఫర్ రామ్? పేరుతో సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయిన డబ్స్మాష్ యాప్తో ఓ వీడియో తీసి రామ్ చరణ్ టీమ్కు పంపించాలి. ఈ వీడియోల నుంచి ఎంపిక చేసిన అభిమానులను రామ్ చరణ్ టీమ్ ధృవ సెట్స్కు ఆహ్వానించనుంది.
కొద్దిరోజులుగా ఈ కాంటెస్ట్కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. రామ్ చరణ్ సినిమాలోని ఏదైనా డైలాగ్ను ఎంపిక చేసుకొని డబ్స్మాష్ వీడియో తయారు చేసి ఈ కాంటెస్ట్కు పంపించాలి. ?ధృవ? సినిమా విషయానికి వస్తే, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కార్పోరేట్ స్థాయి నేరాలను ఎదుర్కొనే పోలీస్ ఆఫీసర్ కథగా మెప్పించనుంది. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.