నేను శైలజ సినిమాతో మళ్లీ ఫామ్లోకి వచ్చిన ఎనర్జిటిక్ హీరో రామ్.. ఆ సక్సెస్ జోష్లో కొత్త సినిమా చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసుకుంటున్నారు. ఇటీవలే వైజాగ్ లో పెద్ద షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నారు. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర మాట్లాడుతూ - ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నాం. నాన్ స్టాప్గా జరిపే ఈ షెడ్యూల్తో సినిమా పూర్తవుతుంది.
దసరా సందర్భంగా సెప్టెంబర్ 30న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం అన్నారు. సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ- కందిరీగ తర్వాత రామ్, నేను కలసి చేస్తున్న చిత్రమిది. రామ్ ఎనర్జీకి తగినట్లు సినిమా హైపర్గా ఉంటుంది. తనలోని ఎనర్జీ మరో లెవల్లో కనిపించే చిత్రం అవుతుంది?? అన్నారు.