ఇటీవల కాలంలో తెలుగు తెరకి పరిచయమైన గ్లామర్ కథానాయికలలో 'రాశీఖన్నా' ముందువరుసలో కనిపిస్తుంది. 'జిల్' సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకున్న రాశీఖన్నా, ప్రస్తుతం బెంగాల్ టైగర్ .. శివం సినిమాలు చేస్తోంది. తాజాగా సాయిధరమ్ తేజ్ చిత్రంలోనూ ఛాన్స్ కొట్టేసినట్టుగా తెలుస్తోంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తరువాత, సాయిధరమ్ తేజ్ చేయనున్న సినిమా ఇదే. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు.
ఈ సినిమా కోసం కొంతమంది కథానాయికలను అనుకుని, చివరిగా రాశీఖన్నాను ఫైనల్ చేశారని సమాచారం. సెప్టెంబర్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'పటాస్' సూపర్ హిట్ కావడం .. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో యూత్ నీ .. మాస్ ని ధరమ్ తేజ్ ఆకట్టుకోవడం ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి కారణమవుతున్నాయి.