రాంగోపాల్ వర్మ ఎప్పుడు కథా కథానాలను సిద్ధం చేసుకుంటాడో, ఎప్పుడు నటీనటులను ఎంపిక చేస్తాడోగానీ ఆయన దర్శకత్వంలో ఒకదాని తరువాత ఒకటిగా సినిమాలు వస్తూనే వుంటాయి. ముందుగా వదిలిన సినిమా హిట్టా .. ఫట్టా? అనే విషయాలను ఆయన పెద్దగా పట్టించుకోడు. తరువాత సినిమాపైనే ఆయన దృష్టి వుంటుంది. అయితే ఈసారి ఆయన కాస్త ఎక్కువ దృష్టి పెట్టాడేమో 'మొగలిపువ్వు' సినిమా కోసం అబ్రాడ్ వెళ్లాడు.
ఈ మధ్య కాలంలో విదేశీ లోకేషన్లతో పనిలేదన్నట్టుగా, లోబడ్జెట్ సినిమాలు చేస్తూ వచ్చిన వర్మ, 'మొగలిపువ్వు' సినిమాలోని ఒక పాటను అందమైన లోకేషన్లలో చిత్రీకరించడం కోసం పోలెండు వెళ్లడం ప్రత్యేకతను సంతరించుకుంది. 6 సంవత్సరాల క్రితం 'అడవి' సినిమా షూటింగ్ కోసం అబ్రాడ్ వెళ్లిన వర్మ, మళ్లీ ఇంతకాలానికి ఈ సినిమా షూటింగ్ నిమిత్తం పోలెండు వెళ్లాడు. సచిన్ జోషి .. మీరాచోప్రా నాయకా నాయికలుగా నటిస్తోన్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది.