Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Feb-2017 12:10:56
facebook Twitter Googleplus
Photo

రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్ గా 2.0 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చాలా భాగం పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్.. ప్రస్తుతం ముంబైలో ల్యాండ్ అయింది. షూటింగ్ పార్ట్ లో చివరి అంకం అంటూ.. హీరోయిన్ అమీ జాక్సన్ స్వయంగా వెల్లడించింది. ఇక్కడి నుంచి గ్రాఫిక్ వర్క్ పై పూర్తిగా కాన్సంట్రేట్ చేయాల్సి ఉంటుంది.

ఇప్పుడీ 2.0 బడ్జెట్ పై కొత్త సంగతులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మొదటగా ఈ మూవీ బడ్జెట్ గా 350 కోట్ల రూపాయలు అనుకున్నారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అన్నారు. ఆ తర్వాత కాంప్రమైజ్ కాకుండా ఉండేందుకు.. స్వయంగా నిర్మాతలే ముందుకు వచ్చి మరో 50 కోట్లు కూడా ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమన్నారు. ఇండియాలో ఒక సినిమాపై 400 కోట్ల రూపాయలా అని అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి. ఇప్పుడు ఆ ఫిగర్ కూడా సరిపోవడం లేదట. మొత్తం పూర్తయ్యేనాటికి రోబో లెక్క 450 కోట్లకు చేరుతుందని తెలుస్తోంది.

హాలీవుడ్ టెక్నీషియన్స్ తో వర్క్ చేయించడం.. ఔట్ పుట్ విషయంలో దర్శకుడు శంకర్ ఏ మాత్రం కాంప్రమైజ్ కాకపోవడంతో.. బడ్జెట్ రోజురోజుకూ పెరిగిపోతోందని తెలుస్తోంది. అయితే.. కంటెంట్ మెప్పిస్తే.. ఈ అమౌంట్ ని రాబట్టడం రజినీకి పెద్ద లెక్క కాదులే.

,  ,  ,  ,  ,