Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jun-2017 10:27:33
facebook Twitter Googleplus
Photo

ఇప్పటివరకూ దేశంలో అత్యంత కాస్ట్లీ బడ్జెట్ తో రూపొందిన చిత్రంగా రజినీకాంత్ నటిస్తున్న 2.0 రికార్డ్ సృష్టిస్తోంది. రోబో సీక్వెల్ గా రూపొందుతున్న ఈ ఒక్క మూవీ కోసమే మొదట 400 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత మరో 50 కోట్లు పెంచారు కూడా. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న 2.0పై భారీ అంచనాలే ఉండగా.. ఇంకా ఈ చిత్రానికి క్లైమాక్స్ పార్ట్ చిత్రీకరించాల్సి ఉంది.

మిగిలిన షూటింగ్ అంతా పూర్తయినా.. క్లైమాక్స్ విషయంలో దర్శకుడు శంకర్ ఇంకా ఓ కంక్లూజన్ కు రాలేదు. ఇప్పటివరకూ చిత్రీకరించిన భాగం ప్రకారం.. శంకర్ కు రెండు రకాల సలహాలు వచ్చాయట. పూర్తిగా గ్రాఫిక్స్ బేస్డ్ గా క్లైమాక్స్ ఉంటే బాగుంటుందని సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పగా.. క్లైమాక్స్ ను లీడ్ కేరక్టర్ల మధ్య రియలిస్టిక్ గా తెరకెక్కిస్తే బాగుంటుందని అన్నాడట విలన్ పాత్రధారి అక్షయ్ కుమార్. అయితే.. శంకర్ మాత్రం ఇంకా ఈ విషయంతో తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. భారీ బడ్జెట్ మూవీ కావడంతో చిన్నపాటి రిస్క్ కూడా తీసుకునే ఉద్దేశ్యం శంకర్ కు లేదు.

ప్రస్తుతం క్లైమాక్స్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నా.. ఎలాంటి క్లైమాక్స్ తీయనున్నాడనే విషయంపై హీరో-విలన్స్ కు ఇంకా క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది.

,  ,  ,  ,