మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్, వరుస విజయాలతో హీరోగా స్టార్ స్టేటస్ సాధించే దిశగా దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. ఈమధ్యే సుప్రీమ్తో మంచి విజయాన్ని అందుకున్న తేజ్, అప్పుడే తన కొత్త సినిమా తిక్కను కూడా విడుదలకు సిద్ధం చేసేస్తున్నారు. ?ఓం? సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా నిన్నటితో టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ఇక మిగిలి ఉన్న పాటలను కూడా త్వరలోనే పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా టీమ్ ప్లాన్ చేస్తోంది.
కేవలం రెండు రోజుల్లో జరిగే కొన్ని విచిత్ర సంఘటనల నేపథ్యంలో నడిచే ఈ సినిమా సాయిధరమ్ తేజ్ గత సినిమాల్లానే మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిందని సమాచారం. రోహిణ్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో లారిస్సా బొనెస్సి, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫస్ట్లుక్తో మంచి అంచనాలను పెంచిన సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.