మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమాల్లో ?ముగ్గురు మొనగాళ్లు? ఒకటి. చిరు త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయమే సాధించింది. ఇందులోని మూడు క్యారెక్టర్లలో చిరు చూపించిన వైవిధ్యం.. ఆయన నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా మెగా అభిమానుల్ని ఉర్రూతలూగించింది. ఈ సినిమాను ఇప్పుడు మల్టీ టాలెంటెడ్ లారెన్స్ రీమేక్ చేయబోతున్నాడట. ఆ చిత్రంలో లారెన్సే మూడు పాత్రల్నీ పోషిస్తాడట. ఈ చిత్రానికి నిర్మాత కూడా లారెన్సేనట. దర్శకత్వ బాధ్యతలు మాత్రం అతను తీసుకోవట్లేదు. ఈ సబ్జెక్టును ఇప్పటి ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్లగా డీల్ చేసే దర్శకుడి కోసం చూస్తున్నట్లు అతను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఐతే ?ముగ్గురు మొనగాళ్లు? డైరెక్ట్ మూవీ కాదు. ?మూండ్రు ముగమ్? పేరుతో వచ్చిన తమిళ సినిమాకు రీమేక్. ఒరిజినల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించడం విశేషం. తెలుగులో కంటే తమిళంలో ఈ సినిమా పెద్ద హిట్టయింది. చిరంజీవి.. రజినీకాంత్ లాంటి ఐకానిక్ స్టార్స్ చేసిన సినిమా రీమేక్ లో రాఘవ లారెన్స్ నటించాలనుకోవడం సాహసమే. వాళ్ల ఇమేజ్.. ఇతడి ఇమేజ్ కు భారీ అంతరం ఉంది. అయితే లారెన్స్ ఆత్మవిశ్వాసం.. అతడి పట్టుదల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా అనుకుంటే చేసి తీరుతాడు. మరి ?ముగ్గురు మొనగాళ్లు? రీమేక్ లో లారెన్స్ ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఈ చిత్రం తమిళ.. తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతుందట.