హీరోయిన్స్ హిట్స్ అందుకోవడం అంటే చాలా అదృష్టం ఉండాలి. రీసెంట్ గా వచ్చిన అలాంటి లక్కీ పిల్ల ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరైనా ఫిదా బ్యూటీ ఉంది కదా అనేస్తారు. తమిళ ముద్దుగుమ్మ సాయి పల్లవి అదృష్టం ఏమిటో గాని ఆమె చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ లెవెల్లో హిట్స్ అయ్యాయి. మలయాళంలో నటించిన రెండు సినిమాలతో పాటు తెలుగులో ఫిదా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.
ఒక్క రోజులోనే అమ్మడి హోదా సౌత్ లో టాప్ కి చేరింది. ఇక ఆఫర్స్ కూడా చాలానే అందుకుంటోంది. కానీ అమ్మడు మాత్రం కేవలం తనకు సెట్ అయ్యే కథలను మాత్రమే చేస్తోంది. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ లో నాని తో MCA సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక మరికొన్ని ప్రాజెక్టులను కూడా త్వరలో స్టార్ట్ చేయనుంది. అలాగే ఏఎల్.విజయ్ దర్శకత్వంలో కణం అనే సినిమాలో నటిస్తోంది. టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య ఆ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే ఎప్పుడు లేని విధంగా అమ్మడి తీరు ఈ మధ్య చిత్ర యూనిట్ వర్గాలకు చాలా కోపాన్ని తెప్పిస్తోందట.
కణం సినిమా షూటింగ్స్ కి అమ్మడు చాలా వరకు లేట్ ఎంట్రిలను ఇస్తోందట. సీన్స్ చిత్రీకరణ కోసం ఉదయం 9:30 గంటలకు చిత్ర యూనిట్ మొత్తం రెడీగా ఉంటే.. మేడం మాత్రం 11-12 గంటలకు వస్తున్నారని కొందరు అంటున్నారు. దీంతో నాగ శౌర్య చాలా కోపంతో ఒక్కోసారి సినిమా నుంచి తాను తప్పుకోవాలనే ఆలోచనతో సతమతమయ్యాడని చిత్ర యూనిట్ వర్గాల నుండి టాక్ బాగా వినిపిస్తోంది.
MCA షూటింగ్ లకు కూడా సాయి అదే టైమ్ కి వెళుతోందట. దీంతో దిల్ రాజు నెక్స్ట్ సినిమాలో ఆమెను తీసుకోవాలని ఓ దర్శకుడు చెప్పినా ఆయన వద్దన్నారని తెలుస్తోంది. అయితే సాయి పల్లవి కెరీర్ మంచి ట్రాక్ లో ఉండగా ఇలాంటి ఆలస్యం ఎందుకో చేస్తుందో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి వారైనా టైమ్ మేనేజ్మెంట్ ని ఫాలో అయితేనే చాలా రెస్పెక్ట్ ఉంటుంది.