అనుకున్నదొక్కటి. అయినదొక్కటి. నిజానికి 'ప్రేమమ్' ఆడియో రిలీజ్ అనగానే అందరూ ఎక్సయిట్ అయ్యారు. ముఖ్యంగా సినిమా ఆడియో సెప్టెంబర్ 20న అని చెప్పగానే అసలు వెంటనే అందరూ ఏఎన్నార్ పుట్టినరోజు నాడు పెట్టిన ఈవెంట్ కాబట్టి.. ఏదో స్పెషాలిటీ ఉందంటూ ఊహించేసుకున్నారు. దానికితోడు.. ఒక స్టార్ హీరోయిన్ వస్తుందని.. ఒక మెగా ప్రకటన చేస్తారని రూమర్లు వినిపించాయి. కాని చివరకు ఏం జరిగిందంటే..
అందరూ ఊహించినట్లు ఇక సమంత ఈ ఈవెంటుకు రానేలేదు. అమ్మడు వస్తుందని అందరూ అనుకున్నా.. అక్కినేని ఫ్యామిలీ అంతా వస్తుంది కాబట్టి ఆమెను ఎందుకు పిలవరు అని అందరూ అనుకుంటే.. చివరకు అసలు నాగ్ అండ్ చైతన్య అఖిల్ తప్పించి అసలు అక్కినేని ఫ్యామిలీయే అక్కడకు రాలేదు. పైగా నాగార్జున కూడా కేవలం 10 నిమిషాలు పాటు కూర్చుని తన ప్రసంగం ముగించేసి వెంటనే చెక్కేశాడు. సో సమంత రాకపోవడం పెద్ద ఆశ్చర్యం కాదులే. ఇకపోతే ఈ ఈవెంట్లో అసలు పర్సనల్ విషయాలు మాట్లాడటానికి ఎటువంటి స్కోప్ ఇవ్వనేలేదు ఎవ్వరు. కాబట్టి ఇక నాగ్ తన కొడుకుల పెళ్లిళ్ళ గురించి ఏం చెప్పనేలేదు.
అయితే ప్రేమమ్ ఆడియోను ఎంజాయ్ చేసిన మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా.. సమంత వచ్చుంటే బాగుండేదని.. ఎందుకంటే బహుశా బ్యాచిలర్ గా చైతన్య జరుపుకునే ఆడియో ఈవెంట్ ఇదే ఆఖరిది కావొచ్చేమోగా.