ఏమాయచేశావే మూవీతో పరిచయమైన చైన్నై సుందరి సమంత ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్రహీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్న సమంత ఇప్పుడు మరో సినిమా చేయడానికి అంగీకరించినట్టు తెలిసింది. గతంలో కన్నడలో ?లూసియా? అనే సినిమా తీసి సంచలనం సృష్టించిన పవన్ కుమార్ ఇప్పుడు కన్నడలో ?యు టర్న్? అనే సినిమా తీసాడు. ఆ సినిమా ట్రయిలర్ చూసిన సమంతకు అది తెగ నచ్చేయడంతో బెంగుళూరు వెళ్ళి ఆ సినిమాని ప్రత్యేకంగా చూసిన విషయాన్ని మేము గతంలోనే తెలియచేసాం. ఇక ఆ సినిమా నచ్చడంతో ?యూ టర్న్? తెలుగు రీమేక్ లో సమంత నటించడానికి అంగీకరించినట్టు తెలిసింది.
ఈ విషయమై సమంత మాట్లాడుతూ ?ఇటీవల నేను బెంగళూరు వెళ్లి యూ టర్న్ మూవీ చూశా. దర్శకుడు పవన్ కుమార్ సినిమాని చాలా బాగా తీశారు. తెలుగు, తమిళ్ లో ఈ సినిమాలో నేను నటించబోతున్నా? అని తెలిపింది. ఈ సినిమాలో సమంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కనిపించనున్నట్టు తెలిసింది. ఈ సినిమా గురించి మిగతా నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. సమంత నటించిన చిత్రాలు అ? ఆ, బ్రహ్మోత్సవం త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే