అల్లు అర్జున్, బోయపాటి శీను కాంబినేషన్ లో వచ్చిన ?సరైనోడు? బాక్సాఫీసు దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతున్న విషయం తెలిసిందే. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి తన శైలిలో ఫైట్లు, డైలాగులు చిత్రీకరించిన విధానానికి తెలుగులో ప్రేక్షకులలో మంచి స్పందన లభించింది.
అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాని మళయాలం లోకి డబ్బింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి తెలుగు వెర్షన్ విడుదల అయిన వారం తరువాత మళయాలం వెర్షన్ విడుదల చేయాలనుకున్నా కుదరలేదు. అయితే ఈ నెల 13 న ?సరైనోడు? మళయాలం వెర్షన్ ?యోధావు? ని విడుదల చేస్తున్నారు. తెలుగులో ఇప్పటికే 40 కోట్ల మార్క్ ని దాటిన ?సరైనోడు? మంచి కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీసు దగ్గర సందడి చేస్తున్నది. ఇక ఇప్పుడు కేరళ లో ఎలా ఆడుతుందో చూడాలి.? ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కాథెరీన్ థ్రెసా హీరోయిన్ లుగా నటించారు