Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Dec-2014 11:23:48
facebook Twitter Googleplus
Photo

అంజలి కథానాయికగా ఇటీవల వచ్చిన 'గీతాంజలి' చిత్రం విభిన్న కథా చిత్రంగా ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న సంగతి విదితమే. ఇప్పుడు దీనికి సీక్వెల్ నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి కూడా 'గీతాంజలి' దర్శకుడు రాజ్ కిరణే దర్శకుడైనప్పటికీ, నిర్మాత మాత్రం మారాడు. క్రేజీ మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై చినబాబు దీనిని నిర్మిస్తున్నారు. దీని గురించి నిర్మాత చెబుతూ, "గీతాంజలి చిత్రం నాకెంతో నచ్చి ఆ దర్శకుడు రాజ్ కిరణ్ తో ఓ సినిమా చేయాలనుకున్నాను. అయితే, వేరే కథతో కాకుండా 'గీతాంజలి' కథతోనే చేయాలనుకున్నాను. ఈ సీక్వెల్ కి రాజ్ కిరణ్ కూడా ఆనందంగా ఒప్పుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ కథానాయిక, కథానాయకుడు ఇందులో నటిస్తారు" అన్నారు. దీనికి వెలిగొండ శ్రీనివాస్ డైలాగులు రాస్తున్నాడు.

,  ,  ,  ,  ,  ,