శమంతకమణి. ఆసక్తికర ప్రోమోలతో జనాల్లో భలే క్యూరియాసిటీ తీసుకొచ్చింది ఈ చిత్రం. నలుగురు యువ కథానాయకులు కలిసి చేస్తున్న ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ ఇది. ఓ వింటేజ్ కారు నేపథ్యంలో సాగే ఈ హీస్ట్ థ్రిల్లర్ కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూసేలా చేశాయి టీజర్.. థ్రిల్లర్.. ఇతర ప్రోమోలు. ఈ నెల 14నే శమంతకమణి ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిర్వహించబోయే ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఐతే ఆ రోజు బాలయ్యతో పాటు మరో విశిష్ట అతిథి ఈ వేడుకకు రాబోతున్నారు. ఆయనే పూరి జగన్నాథ్. బాలయ్య-పూరి కలిసి భవ్య క్రియేషన్స్ బేనర్లో పైసా వసూల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థే శమంతకమణి ని కూడా నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరూ శమంతకమణి ప్రి రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. ఇటీవలే రిలీజైన శమంతకమణి ట్రైలర్ గురించి ఇండస్ట్రీ ప్రముఖులందరూ చాలా పాజిటివ్ గా రెస్పాండయ్యారు. మహేష్ బాబు సైతం ఈ ట్రైలర్ చాలా స్టైలిష్ గా ఇంట్రెస్టింగ్ గా ఉందని కామెంట్ చేశాడు. ఇప్పుడు బాలయ్య.. పూరి లాంటి వాళ్లు వచ్చి ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొంటే శమంతకమణి పై హైప్ మరింత పెరగడం ఖాయం. భలే మంచి రోజు’ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య రూపొందించిన శమంతకమణి లో నారా రోహిత్.. సందీప్ కిషన్.. సుధీర్ బాబు.. ఆది.. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు.