హైదరాబాద్: ఒకహీరోఅనుకుంటే మరో హీరో సీన్ లోకి రావటం కొత్త విషయమేమీ కాదు..ఇప్పుడు అలాగే అంతా బాలయ్యతో చేస్తారు అనుకున్నచిత్రం లోకి తమిళ హీరో లారెన్స్ సీన్ లోకి వచ్చి షాక్ ఇచ్చారు. కన్నడంలో ఘనవిజయం సాధించిన 'శివలింగ' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు దర్శకుడు పి.వాసు సన్నాహాలు చేస్తున్నారు. 'చంద్రముఖి-2' టైటిల్తో రజనీకాంత్తో ఈ సినిమాని రీమేక్ చేయాలని మొదట్లో భావించారు. కానీ, రజనీ '2.0'తో బిజీగా ఉండడంతో ఆ స్థానంలోకి బాలయ్య వస్తారని అంతా భావించారు. అయితే ఊహించని విధంగా లారెన్స్ సీన్ లోకి వచ్చారు. అలాగే లారెన్స్ కి జోడీగా 'ఇరుదుసుట్రు' ఫేమ్ రితికాసింగ్ను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. ప్రస్తుతం ఆమె 'ఆండవన్ కట్టలై' చిత్రంలో నటిస్తోంది. లైకా, ట్రిటెండ్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా 'శివలింగ' తమిళ రీమేక్ను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. తమిళ నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేసే పనిలో పి.వాసు బిజీగా ఉన్నట్లు సమాచారం. స్ర్కిప్టు సిద్ధంగానే ఈ చిత్రం సెట్స్పైకి వెళ్తుంది