దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం 2001 లో ?ఇష్టం? సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది ఢిల్లీ భామ శ్రియ. ఆ తరువాత నాగార్జున తో చేసిన ?సంతొషం?సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత తెలుగు, తమిళ్ భాషల్లో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. స్వతహాగా డాన్సర్ అయిన ఆమె తాజాగా ?ఊపిరి?లో నాగ్కు జోడీగా కన్పించారు. ఇటీవల అవకాశాలు బాగా తగ్గినప్పటికీ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్టులో ఈ ఏడాది శ్రియ 6వ స్థానంలో నిలవడం విశేషం.
హీరోయిన్ గా దాదాపు పదిహేను సంవత్సరాల లాంగ్ ఇన్నింగ్స్ గురించి మీ అభిప్రాయం? ఏమిటి అన్న ప్రశ్నకు శ్రియ సమాధానమిస్తూ ??హీరోయిన్ అంటే కేవలం ఐదేళ్లు సినిమాలు చేయాలి.. ఆ తర్వాత వెళ్లిపోవాలి అనే ఆలోచన సరైనది కాదు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ పెరిగాక ఆర్ట్ సినిమాకూ, కమర్షియల్ సినిమాకూ మధ్య ఉన్న అంతరం బాగా తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు కథానాయిక పాత్రలకూ ప్రాధాన్యం పెరుగుతోంది?? అని చెప్పారు. ప్రస్తుతం శ్రియ తెలుగులో వచ్చిన ఉలవచారు బిర్యాని హిందీ రీమేక్ తడ్కా లో నానాపటేకర్ సరసన నటించబోతున్నది.