జీనియస్', 'రామ్ లీల' చిత్రాల ద్వారా రామదూత క్రియేషన్స్ కి ఓ బేనర్ వేల్యూ తెచ్చుకోగలిగారు నిర్మాత దాసరి కిరణ్ కుమార్. మేకింగ్ విషయంలో రాజీపడకుండా కథకు తగ్గ బడ్జెట్ తో నిర్మించి రాజీపడని నిర్మాత అనిపించుకున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్న చిత్రం `సిద్ధార్థ`. బుల్లితెరపై తన స్టామినాని నిరూపించుకుని వెండితెర దిశగా అడుగులు వేస్తున్న ఆర్.కె.నాయుడు హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి దయానంద్ రెడ్డి దర్శకుడు. సాక్షి చౌదరి, రాగిణీ నంద్వాని నాయికలు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది.
ఈ సందర్భంగా దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ - ''మలేసియా, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమ్మర్ లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నాం. విసు మంచి కథ ఇచ్చారు. వైవిధ్యమైన జోనర్లో సాగే సినిమా ఇది. సిద్ధార్ధగా ఆర్.కె. నాయుడు పవర్ ఫుల్ రోల్ చేశారు. బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ఈ చిత్రం మంచి బ్రేక్ అవుతుంది. ఇందులో ఉన్న నాలుగు పాటలకు మణిశర్మ ఇచ్చిన ట్యూన్స్ హైలైట్ గా నిలుస్తాయి. ఎస్.గోపాల్రెడ్డి గారి లాంటి టాప్మోస్ట్ టెక్నీషియన్ మా సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది`` అని అన్నారు.
ఈ చిత్రానికి కథ - విసు, రచనా సహకారం - రవిరెడ్డి మల్లు, కెమెరా - యస్.గోపాల్ రెడ్డి, సంగీతం - మణిశర్మ, సాహిత్యం - అనంత శ్రీరామ్, మాటలు - పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, ఫైట్స్ - సాల్మాన్ రాజ్ (భాహుబలి ఫేం), ఆర్ట్ - బ్రహ్మ కడలి, కొరియోగ్రఫీ - హరీశ్ పాయ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత - ముత్యాల రమేశ్, సమర్పణ - లంకాల బుచ్చిరెడ్డి, నిర్మాత -దాసరి కిరణ్ కుమార్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - దయానంద్ రెడ్డి.