త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం ఆడియో వేడుకకు డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 15న ఈ వేడుకను హైదరాబాదులో అభిమానుల సమక్షంలో గ్రాండుగా నిర్వహించడానికి నిర్మాత ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విచ్చేస్తారని ప్రచారం జరుగుతోంది. బన్నీ సరసన ఇందులో సమంతా, ఆదా శర్మ, నిత్యా మీనన్ కథానాయికలుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.
alluarjun, trivikram, dsp, raghudixit, audioon15thmarch,