మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, దర్శకుడు శ్రీనువైట్లల కాంబినేషన్లో ఓ సినిమా సెట్స్పైకి వెళ్ళేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ?ఆగడు?, ?బ్రూస్ లీ? లాంటి పరాజయాల తర్వాత ఎలాగైనా తన స్థాయి సినిమా తీయాలన్న ఆలోచనతో శ్రీనువైట్ల ఈ ప్రాజెక్టు కోసం చాలా నెలలుగా కష్టపడుతూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ చివరిదశకు చేర్చిన టీమ్ ఈనెల 27న హైద్రాబాద్లో పూజా కార్యక్రమాలతో వైభవంగా సినిమాను ప్రారంభించనుంది.
ఒక్కో సినిమాకూ ఒక్కో తరహా పాత్రను ఎంచుకుంటూ హీరోగా తనదైన మార్క్ మూడు సినిమాలకు సెట్ చేసుకున్న వరుణ్, శ్రీనువైట్ల సినిమాలో మరో కొత్త తరహా పాత్రతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్ నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించనున్నారన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ప్రారంభ వేడుక రోజే సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను దర్శక, నిర్మాతలు వెల్లడించనున్నారు.